ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

Thursday, December 26, 2024 07:43 PM News
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల 31వ తేదీనే పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేసిన వినతి మేరకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. అయితే, జనవరి 1 2025న పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారని సమాచారం.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: