అత్యాచారాలు చేసి కుంభమేళాకు వెళ్తుండగా..
అత్యాచారం చేసి జైలుకెళ్లడం తిరిగొచ్చి మళ్లీ అదే పని చేసే ఓ వ్యక్తి మహాకుంభమేళాకు వెళ్తూ దొరికిపోయాడు. మధ్య ప్రదేశ్ కు చెందిన రమేశ్ సింగ్ 2003లో 5 ఏళ్ల చిన్నారిని రేప్ చేసి పదేళ్లు జైలుకెళ్లొచ్చాడు.
మళ్ళీ 2014లో 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసి టెక్నికల్ ఆధారాలు లేక 2019లో జీవితఖైదు శిక్ష నుంచి బయటపడ్డాడు. తాజాగా ఈ నెల 2న 11 ఏళ్ల బాలికపై హత్యాచారం చేశాడు. ఆపై ప్రయాగ్రాజ్ వెళ్తుండగా జైపూర్ వద్ద పోలీసులు అతడిని పట్టుకున్నారు.