అన్నను చంపేస్తా.. వదినను నేను చూసుకుంటా.. మేడ్చల్ మర్డర్ కేసులో సంచలన నిజాలు
మేడ్చల్లో బస్ డిపో ముందు ఆదివారం ఉమేశ్ అనే వ్యక్తిని సోదరులే కత్తులతో నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వివరాల ప్రకారం హత్యకు గురైన ఉమేశ్ మద్యానికి బానిసై రోజూ ఇంట్లో గొడవ చేస్తూ తన భార్యను, తల్లిని కొట్టేవాడు.
అతని టార్చర్ భరించలేని సోదరులకు ఓపిక నశించింది. వదినను తాను చూసుకుంటానని హామీ ఇచ్చి, అన్నను చంపేస్తానని తమ్ముడు రాకేశ్ ముందుగానే తన తల్లికి చెప్పాడు. అన్నట్లుగానే ఉమేశ్ ను కత్తితో పొడిచి హత్య చేశాడు.