ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

Entertainment Published On : Friday, January 31, 2025 12:00 PM

ఓటీటీలోకి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. టొవినో థామస్, త్రిష జంటగా నటించిన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఐడెంటిటీ' ఓటీటీలోకి వచ్చింది. జీ5లో ఈ మూవీ గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ ఆ సినిమా ప్రసారమవుతోంది. మలయాళంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 24న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది.