Breaking: డీఎస్సీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఏపీలో 2025 మెగా డీఎస్సీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల వయో పరిమితి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ఠ వయో పరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంచింది. కటాఫ్ తేదీ 2024 జూలై 1గా నిర్ణయించింది. ఈ డీఎస్సీకి మాత్రమే వయోపరిమితి పెంపుదల చేసింది.