ఏపీలో టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీలో టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న 45 యాప్ ల స్థానంలో ఒకే యాప్ తీసుకురావాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. టీచర్లు కేవలం బోధన, హాజరు, విద్యార్థుల లెర్నింగ్ సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందివ్వాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు.