టీటీడీలో సిబ్బంది తొలగింపు.. స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ

News Published On : Saturday, February 8, 2025 09:56 PM

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లో 18 మంది హిందూయేతర సిబ్బందిని తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇది చాలా తప్పుడు సందేశాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.

వక్స్ సవరణ బిల్లుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఏ ప్రాతిపదికన మద్దతిస్తోందని ప్రశ్నించారు. ముస్లిమేతరులెవరైనా వర్ఫ్ బోర్డులో ఎలా భాగం అవుతారని ఒవైసీ ప్రశ్నించారు. ముస్లింలకు వర్ఫ్ బోర్డు చాలా పవిత్రమైనదని ఆయన తెలిపారు.