లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి కేంద్ర కారాగారంలో లొంగిపోయారు. మంగళవారం సాయంత్రంతో (మార్చి 11) ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. కానీ గడువు సమయానికి లొంగిపోయేందుకు ఆయన జైలుకు రాకపోవడంతో సంబంధిత అధికారులు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ఈ రోజు జైలులో లొంగిపోయారు.
ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ కోసం రాజమండ్రి జైలుకు గుంటూరు పోలీసులు వెళ్లారు. పాస్టర్ ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటనలో పీటీ వారెంట్పై బోరుగడ్డను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకురానున్నారు.