ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్

News Published On : Thursday, February 27, 2025 01:00 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు.

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర, పిడిఎఫ్ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణ రావు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...