ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. పీఠం దక్కేది ఎవరికో..?

News Published On : Saturday, February 8, 2025 07:51 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న దేశ రాజధానిలో అధికారం చేపట్టాలంటే 36 స్థానాలు గెలుచుకోవాలి. తాము 50 సీట్లతో విజయఢంకా మోగించబోతున్నామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా మూడోసారి అధికారం తమదేనని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది.

2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత పడిపోయింది. ఈ సారి కనీసం పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది.