ఏపీలో మంత్రిని నిలదీసిన రైతులు
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మార్కెట్ ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు వచ్చిన పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఎన్టీఆర్ జిల్లా రైతులు షాకిచ్చారు. మంత్రి రాకపై సమాచారం అందుకున్న రైతులు మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయలేదని మంత్రి మనోహర్ ని నిలదీశారు. మిల్లర్లు తమను దోచుకుంటున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులైనా డబ్బులు పడలేదని మంత్రిని రైతులు ప్రశ్నించారు.