ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం
ఏపీ సచివాలయంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో బ్లాక్లో మంటలు చెలరేగాయి. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.