తుపాకీతో కాల్చుకుని మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్య
జమ్మూకశ్మీర్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఫకీర్ మహ్మద్ ఖాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాను నివాసం ఉంటున్న ప్రభుత్వ క్వార్టర్స్ రివాల్వర్ గన్ తో పాయింట్ బ్లాక్ లో కాల్చుకొని ప్రాణం తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపడుతున్నారు.
మహ్మద్ ఖాన్ మృతికి జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు రెండు నిమషాల పాటు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఫకీర్ మృతి పట్ల స్థానిక బీజేపీ నేతల సంతాపం వ్యక్తం చేశారు.