చికెన్ ఫ్రీ.. ఎగబడిన జనం

News Published On : Friday, February 21, 2025 09:55 PM

చికెన్ వంటకాలు ఫ్రీ అనగానే జనం ఎగబడ్డారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పలువురు చికెన్ వాడకంపై అవగాహన కల్పిస్తూ చికెన్, ఎగ్ స్నాక్స్ ఫ్రీగా అందించారు. గుంటూరు పట్టాభిపురంలోని స్వామి థియేటర్ గ్రౌండ్లో, హైదరాబాద్ లోని ఉప్పల్ గణేశ్నగర్ వద్ద ఫుడ్ మేళాలు నిర్వహించారు.

ఈ మేళాలకు జనాలు ఎగబడటంతో జనాల తాకిడికి నిర్వాహకులు చేతులెత్తేశారు. గుంటూరులో రద్దీ తట్టుకోలేక గేట్లు మూసేశారు. నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 70 డిగ్రీలలో ఉడికించి చికెన్ తినడం వల్ల ఏమీ కాదని ప్రభుత్వాలు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...