ఏపిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

News Published On : Sunday, April 13, 2025 02:51 PM

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి నలుగురు మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.