విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
లిక్కర్ కేసులో రేపు విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఈ రోజే విచారణకు హాజరవుతానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుడైన కసిరెడ్డికి 4 సార్లు నోటీసులు పంపినా విచారణకు రాలేదని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మద్యం కుంభకోణంలో రాజశేఖర్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశించినా స్పందించలేదని వెల్లడించారు.