ఉగ్రవాదుల నెక్ట్స్ టార్గెట్ వారే..!
జమ్మూ కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇటీవల పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా లోయలో పనిచేస్తున్న స్థానికేతరులు, కశ్మీరీ పండిట్లు, రైల్వే మౌలిక సదుపాయాలే వారి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు.