ఏపీ: నిలిచిన రైళ్ల రాకపోకలు

News Published On : Monday, March 17, 2025 07:42 AM

రైల్వే వంతెన కుంగడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో నెలకొంది. అర్ధరాత్రి టిప్పర్ వాహనం వంతెన నుంచి వెళ్తుండగా గడ్డర్ ను ఢీకొట్టింది. దీంతో రైల్వే ట్రాక్ దెబ్బతింది.

విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి, విశాఖ, మహబూబ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ కు అధికారులు, సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...