వల్లభనేని వంశీకి షాక్.. రిమాండ్ పొడిగింపు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ సిఐడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వంశీని కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో దానికి కోర్టు అంగీకరించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.