Breaking: పార్టీకి మాజీ ఎమ్మెల్సీ రాజీనామా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి తీరు నచ్చకపోవడముతో ఆ మాజీ ఎమ్మెల్సీ పార్టీని వీడినట్లు తెలియజేశాడు. రాజీనామా అనంతరం ఆయన రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంచార్జ్ కపిలవాయి దిలీప్ కుమార్ను అధ్యక్షుడు జయంత్ చౌదరి నియమించారు.