కాంగ్రెస్ లోకి విజయసాయి రెడ్డి.. షర్మిలతో భేటీ..

Politics Published On : Saturday, February 1, 2025 10:30 PM

ఇటీవల వైసీపీకి సీనియర్ నేత విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే విషయమై ఆయన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో చర్చించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉన్న షర్మిల నివాసానికి వెళ్లిన విజయసాయి దాదాపు 2 గంటలు ఆమెతో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమావేశంలో ఇరువురు ఏం చర్చించారనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.