ప్రశాంత్ కిశోర్ తో నారా లోకేశ్ భేటీ
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలో పర్యటించిన లోకేశ్ ప్రశాంత్ కిశోర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం నివాసం 1-జన్పథ్ లో దాదాపు గంట పాటు ఈ భేటీ సాగింది.
ఏపీ, బిహార్, దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. ఐప్యాక్ నుంచి బయటికొచ్చిన ప్రశాంత్ బిహార్ 'జన్ సురాజ్' పేరుతో పార్టీ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.