2028 ఒలింపిక్స్: క్రికెట్ వేదికను ప్రకటించిన ఐసీసీ
2028లో లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కూడా ఉండనుంది. అయితే క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే వేదికను ఐసీసీ ప్రకటించింది. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న పొమోనా సిటీలోని ఫెయిర్క్రాండ్స్లో క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు ఐసీసీ తెలిపింది. కాగా, సుమారు 128 ఏళ్ల తర్వాత క్రికెట్ ను మళ్ళీ ఒలింపిక్స్ గేమ్స్ లోకి ప్రెవేశపెట్టిన విషయం తెలిసిందే.