రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!
భారత కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనున్నట్లు సమాచారం. ప్రతిష్ఠాత్మక వాంఖడే స్టేడియంలో స్టాండ్స్, వాకింగ్ బ్రిడ్జిలకు ప్రముఖ ముంబై క్రికెటర్ల పేర్లు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) యోచిస్తోంది. ఓ స్టాండ్ కు రోహిత్ శర్మ పేరిట నామకరణం చేయనున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్లేయర్స్ అజిత్ వాడేకర్, ఏక్నాథ్ సోల్కర్, శివాల్కర్, డయానా ఎడుల్జీ తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.