IPL 2025: ఉత్కంఠ పోరు.. RCB విజయం
IPL 2025లో భాగంగా నేడు ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో RCB విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో ఉత్కంఠ పోరులో ముంబైను సొంత గడ్డపై ఓడించింది. ముంబై బ్యాటర్లు పోరాడి ఓడిపోయారు. హార్దిక్ పాండ్య 42 పరుగులు, తిలక్ వర్మ 56 పరుగులతో రాణించారు. కాగా మొదట RCB నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. అయితే 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులతో సరిపెట్టుకుంది.