మొబైల్ రీఛార్జిలపై గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Technology Published On : Tuesday, January 21, 2025 01:29 PM

మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. రీఛార్జ్ చేయకపోయినా సిమ్ ఎక్కువ కాలం యాక్టివేట్ అయి ఉండేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చింది. జియో, ఎయిర్టెల్, Vi యూజర్స్ 90 రోజులు, బిఎస్ఎన్ఎల్ 180 రోజుల పాటు యాక్టివేట్ గా ఉంటాయని తెలిపింది. అనంతరం సిమ్ యాక్టివ్ గా ఉండాలంటే నెట్వర్కును అనుసరించి రీఛార్జ్ చేసుకోవాలని పేర్కొంది. ఇది రూ.20తో ప్రారంభించాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ సూచించింది. రెండు సిమ్ కార్డులు వాడేవారికి ఇది ఊరట కల్పించనుంది.