నేడు భిన్న వాతావరణం
గురువారం ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
బుధవారం రాత్రి 8 గంటల నాటికి అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మిమీ, తిరుపతి జిల్లా పూలతోటలో 41మిమీ, అనకాపల్లి జిల్లా మాడుగులలో 36.5మిమీ చొప్పున వర్షపాతం నమోదయిందన్నారు. అలాగే బుధవారం కర్నూలులో 40.7°C, నంద్యాల జిల్లా గోస్పాడు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లిలో 40.4°C,వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట,మూలవంక, ఖాజీపేటలో 40.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయిందన్నారు.
భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.