నిండు ప్రాణాన్ని బలిగొన్న ట్రాఫిక్ పోలీసులు
Tuesday, April 15, 2025 08:43 PM Crime
_(2)-1744729961.jpeg)
నిండు ప్రాణాన్ని ట్రాఫిక్ పోలీసులు బలిగొన్న దారుణ ఘటన హైదరాబాద్ బాలానగర్ లో చోటు చేసుకుంది. సరైన ఏర్పాట్లు లేకుండా ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీలు ఓ వాహనదారుడి ప్రాణాన్ని బలిగొన్నాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనదారుడిని ఆపేందుకు కానిస్టేబుల్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. వెనకే వస్తున్న బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తోటి వాహనదారులు రోడ్డుపై ఆందోళనకు దిగగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: