కదులుతున్న రైలులో నిండు గర్భిణిపై అత్యాచారం

Friday, February 7, 2025 10:48 PM Crime
కదులుతున్న రైలులో నిండు గర్భిణిపై అత్యాచారం

తమిళనాడులోని కేవీ కుప్పం స్టేషన్ సమీపంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు గర్భిణిపై లైంగిక వేధింపులకు పాల్పడి కదులుతున్న ట్రైన్ నుంచి తోశేశాడు. కోయంబత్తూరు, తిరుపతి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ ఘటన జరిగింది. బాత్రూమ్కి వెళ్లిన సమయంలో గర్భిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మహిళ అరుస్తున్నా నిందితుడు హేమరాజ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

మహిళ కేకలేస్తుండటంతో కదులుతున్న రైలు నుంచి తోసివేసాడు. గర్భిణి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. మహిళను తోటి ప్రయాణికులు కాపాడారు. ఆ మహిళను చిత్తూరు వాసిగా గుర్తించారు. కాట్పాడి రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: