Breaking: రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట

Saturday, February 15, 2025 11:00 PM News
Breaking: రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం భారీ తొక్కిసలాట జరిగింది. 13, 14 ప్లాట్ ఫాంలపై రైళ్లు ఎక్కేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు తరలిరావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో పలువురు స్పృహ కోల్పోయారు.

ఈ ఘటనలో 15 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు రైల్వేశాఖ రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఆ రైళ్లు కూడా ప్రయాణికుల రద్దీకి సరిపోలేదని సమాచారం.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: