భారత్ లో జీతాలు పెరుగుతాయి: ఏఓఎన్ సర్వే
Sunday, February 23, 2025 12:00 PM News

ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు తగ్గుతున్నప్పటికీ ఈ ఏడాది భారత్ లో వేతనాలు సగటున 9.2 శాతం పెరుగుతాయని Aon PLC అంచనా వేసింది. ఈ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ సంస్థ 45 రంగాలకు చెందిన 1,400కు పైగా కంపెనీల నుంచి వివరాలు సేకరించింది.
ఆటోమోటివ్, వెహికల్ తయారీ విభాగాల్లో అత్యధికంగా 10.2 శాతం పెంపు ఉండొచ్చని పేర్కొంది. ఆ తర్వాత ఎన్బిఎఫ్సీలో 10 శాతం, రిటైల్ రంగంలో 9.8 శాతం, ఇంజినీరింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లో 9.5 శాతం వేతనాల వృద్ధి ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: