బెంగళూరు మెట్రోలో జనాల ముందే ఓ జంట పాడు పని (వీడియో)

జనాలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా బెడ్ రూమ్ లో చేయాల్సిన పనులను ఓ జంట మెట్రో స్టేషన్ లోనే చేసేసారు. జనాల మధ్యలో చూడకూడని పనులు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఓ యువతి ప్రైవేట్ భాగాలు నొక్కుతూ యువకుడు రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది.
బెంగళూరు నగరంలోని ఓ ప్రముఖ మెట్రో స్టేషన్ లో యువ జంట దరిద్రంగా ప్రవర్తించింది. మెట్రో స్టేషన్ లోని టికెట్ బుకింగ్ సెంటర్ దగ్గర. జనాలంతా క్యూ లైన్ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు టికెట్లు తీసుకుంటున్న సమయంలో వైట్ కలర్ జాకెట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ప్రైవేటు భాగాలను వెనుక నుంచి ఓ కుర్రాడు నొక్కాడు.ఈ యువ జంట ముందు జనాలు క్యూ లైన్ లోనే ఉన్నారు. వాళ్లు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారు. ఆ యువతి కూడా ఏమాత్రం ఇన్సల్ట్ గా ఫీల్ కాకుండా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అయితే సంఘటన బెంగళూరులోని మాదవర అనే మెట్రో స్టేషన్ లో జరిగినట్లు చెబుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ వస్తున్నాయి. ఢిల్లీ మెట్రో కల్చర్ బెంగళూరుకు కూడా తీసుకువచ్చారని నెటిజెన్స్ మండిపడుతున్నారు. వీళ్లకు కొంచెం కూడా సిగ్గు లేదని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.