తెలంగాణలో కొత్త వ్యాధి.. తొలి కేసు నమోదు
Friday, January 31, 2025 01:00 PM News
గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) తెలంగాణకు వ్యాప్తి చెందింది. ఆ వ్యాధి తొలి కేసు నమోదైంది. మహారాష్ట్రలో ఆ వ్యాధి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె హైదారాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది అంటువ్యాధి కాదని, త్వరగా నయం చేయవచ్చని అంటున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: