రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు
Saturday, April 12, 2025 01:45 PM News
_(14)-1744422605.jpeg)
రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI లేదా ఇంజినీరింగ్ లో డిగ్రీ/డిప్లమా పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల వయసు ఈ ఏడాది జులై 1 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్, OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మే 11 చివరి తేదీగా ప్రకటించారు. మరిన్ని వివరాలకు www.indianrailways.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: