ఏపీ: నిలిచిన రైళ్ల రాకపోకలు
Monday, March 17, 2025 07:42 AM News
_(22)-1742177548.jpeg)
రైల్వే వంతెన కుంగడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో నెలకొంది. అర్ధరాత్రి టిప్పర్ వాహనం వంతెన నుంచి వెళ్తుండగా గడ్డర్ ను ఢీకొట్టింది. దీంతో రైల్వే ట్రాక్ దెబ్బతింది.
విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి, విశాఖ, మహబూబ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ కు అధికారులు, సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: