నేడు భిన్న వాతావరణం
Thursday, April 17, 2025 08:00 AM Weather
_(31)-1744824985.jpeg)
గురువారం ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
బుధవారం రాత్రి 8 గంటల నాటికి అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మిమీ, తిరుపతి జిల్లా పూలతోటలో 41మిమీ, అనకాపల్లి జిల్లా మాడుగులలో 36.5మిమీ చొప్పున వర్షపాతం నమోదయిందన్నారు. అలాగే బుధవారం కర్నూలులో 40.7°C, నంద్యాల జిల్లా గోస్పాడు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లిలో 40.4°C,వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట,మూలవంక, ఖాజీపేటలో 40.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయిందన్నారు.
భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: